Header Banner

పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావు లేదు.. మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు! నేతలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

  Fri Mar 14, 2025 21:44        Politics

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు పేర్లను సిఫారసు చేసేందుకు కొందరు నేతలు ఆలస్యం చేస్తున్నారని.. ఈ సందర్భంగా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా నామినేటెడ్ పదవుల కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడిన వారి వివరాలను అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ చేశారు. నామినేటెడ్ పదవుల కోసం సరైన వ్యక్తులను నియమిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు ఛైర్మన్ల నియామకం త్వరలోనే చేపడతామని చెప్పారు. నామినేటెడ్‌ పదవుల కోసం ఇప్పటివరకు 60 వేల దరఖాస్తులు వచ్చాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దని.. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పదవులు కేటాయించిన వారి పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలని.. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని హితవు పలికారు. అయితై తాను ఇలా చెప్పడం వల్ల వైసీపీకీ ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో వివక్ష ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరని ఈ సందర్భంగా హితవు పలికారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చోటు లేకుండా చూసే బాధ్యత మంత్రులదేనని తేల్చి చెప్పారు. ఆయా జిల్లాల ఇంఛార్జ్‌ మంత్రులు.. వారి జిల్లాల్లో మరిన్ని పర్యటనలు పెంచాలని తెలిపారు. కూటమిలోని 3 పార్టీల నేతలు, కార్యకర్తలను కలుపుకుని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #APCM #CBN #nominated #post #todaynews #flashnews #latestnews